గమనించగలరు : ఈరోజు సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్రో సేవలు బంద్

Metro train Speed hike
Metro train Speed hike

ఈరోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభ జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు మెట్రో సేవలను నిలిపి వేస్తున్నట్టు స్పష్టం చేశారు. పరేడ్‌ గ్రౌండ్‌లో సభ కారణంగానే 3 గంటల పాటు సేవలను నిలిపి వేస్తున్నట్టు తెలిపారు.

ప్యారడైజ్, పరేడ్ గ్రౌండ్స్ , JBS మెట్రో స్టేషన్లు ఆదివారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 గంటల మధ్య మూసివేస్తామని అధికారులు తెలిపారు. ఈ టైమింగ్స్ లో మెట్రో రైళ్లు ఈ స్టేషన్ల దగ్గర ఆగవని.. కారిడార్ 2(JBS నుంచి-MGBS) రైళ్లు సికింద్రాబాద్ వెస్ట్ & MGBS మధ్య నడుస్తాయన్నారు. ప్రయాణికులు దీనిని గమనించాలని సూచించారు. కారిడార్ 1 (మియాపూర్- నుంచి ఎల్‌బి నగర్) రూట్ లో ఎటువంటి మార్పు లేదని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. అయితే మోడీ సభా క్రమంలో రెండు రోజులపాటు మెట్రో రైల్లు నిలిచిపోనున్నాయని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను సంస్థ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తోసిపుచ్చారు. ఆదివారం సాయంత్రం వరకు మూడు కారిడార్లలో రైళ్లు యధావిధిగా నడుస్తాయని చెప్పారు. సభ జరుగుతున్న సమయంలో మాత్రమే ఈ మూడు స్టేషన్లలో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ క్లారిటీ ఇచ్చారు.

ఈ సభ కోసం తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు సికింద్రాబాద్ తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. స్థానిక జింఖానా గ్రౌండ్స్‌లో వీఐపీ పార్కింగ్ ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌ సభా స్థలి వద్ద వీవీఐపీల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. శామీర్‌పేట్, సిద్ధిపేట్, కరీంనగర్ నుంచి వచ్చే వారికి దోబీఘాట్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుంచి సుచిత్ర, బాలానగర్ మీదుగా వచ్చే వారికి పోలో గ్రౌండ్స్‌లో, వరంగల్, నల్గొండ, ఉప్పల్ నుంచి వచ్చే వారికి రైల్ నిలయంలో, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ట్యాంక్ బండ్ వైపు నుంచి వచ్చే వారికి నెక్లెస్ రోడ్డులో పార్కింగ్ ఏర్పాటు చేశారు.