న్యూయార్క్‌ ‘మెట్‌ గాలా-2021’లో మెరిసిన మేఘా సుధారెడ్డి

ఈఏడాది భారత్‌ నుంచి ఆమె ఒక్కరే పాల్గొనటం విశేషం.

Sudha Reddy in Met Gala-2021
Sudha Reddy in Met Gala-2021

న్యూయార్క్‌ నగరంలో ఇటీవల ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ‘మెట్‌ గాలా-2021’లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి ప్రత్యేకంగా నిలిచారు. స్పెషల్ డిజైన్‌ చేసిన గౌనులో ఆమె మెరిశారు. ఈ ఏడాది థీమ్‌ ‘అమెరికన్‌ ఇండిపెండెన్స్‌’కు తగ్గట్లు అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్లు ఫల్గుని, షేన్‌ పీకాక్‌ తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించారు. దీని తయారీకి 250 గంటలు పట్టినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా , ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ పాల్గొన్నారు. మెట్‌ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం ఇదే ప్రధమం తో పాటు ఈఏడాది భారత్‌ నుంచి ఆమె ఒక్కరే పాల్గొనటం విశేషం.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/