గొప్ప మనసు చాటుకున్న మెస్సీ
కరోనా పై పోరుకు రూ. 8.2 కోట్లు విరాళం
బార్సిలోనా: అర్జెంటీనా పుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడాని తన వంతుగా సహయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనాపై పోరాడేందుకు ఒక మిలియన్ యూరోలను మెస్సీ విరాళంగా ప్రకటించాడు. ఇది భారత కరెన్సిలో రూ. 8.2 కోట్లు. అయితే ఈ మొత్తంలో సగం బార్సిలోనా ఆసుపత్రులకు, మిగిలిన సగం అర్జెంటీనాలో కరోనాపై పోరాడేందుకు ఖర్చుచేయనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/