మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తప్పు చేసాడని కీలక వ్యాఖ్యలు చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తో పాటు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు క్రేజ్ ఓటింగ్ కు పాల్పడ్డారని, దీంతో టీడీపీ విజయం సాధించిందని ఆరోపిస్తూ వారిని వైస్సార్సీపీ పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ..చంద్రశేఖర్ రెడ్డి ఫై కీలక వ్యాఖ్యలు చేసారు.

తన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేయడం తప్పేనని.. తన మాట వినకుండా చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. చిన్నప్పటి నుంచే అతడి వైఖరి తప్పుగా ఉండేదని, అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాస్త బాగానే ఉన్నాడని రాజమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో తనకంటే చురుగ్గా ఉంటున్నాడని .. అందరినీ అల్లుడూ, అన్నా, తమ్ముడూ అంటూ భుజాలమీద చేతులు వేస్తూ కలుపుగోలుగా ఉండేవాడని వివరించారు. తమ్ముడితో పోల్చితే తాను కొంచెం రిజర్వ్ డ్ గా ఉండే వ్యక్తినని రాజమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, 2019 వరకు చంద్రశేఖర్ రెడ్డి బాగానే ఉన్నాడని, కానీ కొంతకాలంగా ఆయన పంచన ఓ దుష్టశక్తి చేరిందని ఆయనతో నీచాతి నీచమైన దరిద్రపు పనులన్నీ చేయిస్తోందని తెలిపారు.

తన తమ్ముడి వద్ద ఉండే వ్యక్తుల ద్వారా తాను వారించే ప్రయత్నం చేశానని, కానీ అతడు తన మాట వినలేదని విచారం వ్యక్తం చేశారు.