ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో మేకపాటి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి?

శ్రీకీర్తిని బరిలోకి దించాలని యోచిస్తున్న వైస్సార్సీపీ అధిష్ఠానం
శ్రీకీర్తి బరిలోకి దిగితే పోటీ నుంచి తప్పుకోనున్న టీడీపీ!

అమరావతి: దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి తర్వలో ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఉపఎన్నికలో గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తిని బరిలోకి దింపాలని వైస్సార్సీపీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, మేకపాటి కుటుంబం మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెబుతున్నారు.

వైస్సార్సీపీ కనుక శ్రీకీర్తిని బరిలోకి దింపితే తాము కొనసాగిస్తున్న సంప్రదాయం ప్రకారం పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ భావిస్తోంది. వ్యక్తుల మృతితో ఖాళీ అయిన స్థానంలో వారి కుటుంబ సభ్యులు బరిలోకి దిగితే పోటీ చేయకూడదన్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోంది. ఆత్మకూరు విషయంలోనూ అదే పాటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, ఆత్మకూరు ఉప ఎన్నికను ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఎన్నికల సంఘం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/