జూబ్లీహిల్స్‌లోని నివాసానికి మేక‌పాటి భౌతికకాయం తరలింపు

జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న నివాసానికి ప‌లువురు నేత‌లు

హైదరాబాద్ : ఏపీ మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న పార్థివ దేహాన్ని హైద‌రాబాద్‌ అపోలో ఆసుప‌త్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి గౌతమ్ రెడ్డి నివాసానికి త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న నివాసానికి ప‌లువురు నేత‌లు, బంధువులు, వైస్సార్సీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

ఆ ప్రాంతంలో పోలీసులు భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ హైద‌రాబాద్ చేరుకున్న వెంట‌నే అక్క‌డికి వెళ్లి ప‌రామ‌ర్శించ‌నున్నారు. అలాగే, ప‌లువురు ఏపీ నేత‌లు కూడా జూబ్లిహిల్స్ బ‌య‌లుదేర‌నున్నారు. కాగా, జూబ్లీహిల్స్‌లోని నివాసం వ‌ద్ద ఆయ‌న గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని కొద్దిసేపు ఉంచాక మ‌ళ్లీ ఏపీకి తీసుకెళ్ల‌నున్న‌ట్లు
తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/