మంత్రి కేటీఆర్‌తో మేఘాల‌య సీఎం సంగ్మా భేటీ

శాలువా కప్పి సత్కరించిన కేటీఆర్ దంపతులు

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ తో మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా భేటీ అయ్యారు. ఈరోజు ప్రగతి భవన్ లో కేటీఆర్, శైలిమ దంపతులను సంగ్మా దంపతులు కలిశారు. ఈ సందర్భంగా సంగ్మా దంపతులను కేటీఆర్ దంపతులు శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై కేటీఆర్, సంగ్మా చర్చించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ భేటీ ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. కేటీఆర్ తో భేటీ కావడం సంతోషంగా ఉందని సంగ్మా ప్రకటించగా.. సంగ్మాతో సమావేశమవడంపట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/