మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం..
మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే వెబ్ సిరీస్ లో నటించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కరోనా దెబ్బకు చాల నెలలు థియేటర్స్ మూతపడ్డాయి. దీంతో సినీ లవర్స్ ఓటిటి లకు అలవాటుపడ్డారు. సినిమాను తలపించేలా వెబ్ సిరీస్ లు ఉండడం , అగ్ర నటి నటులు నటించడం తో వెబ్ సిరీస్ లకు ఫుల్ డిమాండ్ వచ్చింది. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు అందిస్తుండడంతో ఓటిటి సంస్థలు సైతం వెబ్ సిరీస్ లపై ఇంట్రస్ట్ చూపిస్తున్నాయి. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఓటీటీ కోసం వెబ్ సిరీస్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొన్ని ఓటీటీ సంస్థలు చిరంజీవిని సంప్రదించినట్లు సమాచారం. వారి దగ్గరు ఉన్న కొత్త కాన్సెప్ట్లను కూడా వినిపించారట.
అయితే తన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్తో తన క్యారెక్టర్ చాలా ఫవర్ఫుల్ ఉండేలా కథను సిద్ధం చేసుకొని రమ్మని చెప్పారట. మరి చిరు రేంజ్ కి తగ్గట్లు కథ తీసుకొస్తారో లేదో చూడాలి. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే..వరుస సినిమాలతో ఈ ఏడాదంతా ఫుల్ బిజీగా ఉన్నారు చిరంజీవి. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘గాడ్ఫాదర్’ దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ కాబోతుంది. మరోవైపు మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న ‘భోళాశంకర్’ షూటింగ్ కూడా జెడ్ స్పీడ్లో జరుగుతోంది. ఇక బాబీ దర్శకత్వం తెరకెక్కే చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. చేతిలో ఉన్న ఈ మూడు చిత్రాలే కాకుండా.. మరో రెండు సినిమాలకు కూడా త్వరలో అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు.