ఈ సాయంత్రం కేంద్రమంత్రుల సమావేశం

రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశం భేటి

Rajnath Singh
Rajnath Singh

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ ఈసాయంత్రం కేంద్రమంత్రుల బృందం సమావేశం కానుంది. వచ్చే నెల 3వ తేదీ తరువాత లాక్ డౌన్ ను ఏ విధంగా తొలగించాలన్న విషయమై చర్చించేందుకు నేటి సాయంత్రం 4గంటలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో కీలక సమావేశం జరుగనుంది. పలువురు కేంద్ర మంత్రులతో చర్చించనున్న రాజ్ నాథ్ సింగ్, ఆపై సమావేశం వివరాలను ప్రధాని నరేంద్రమోడికి తెలుపనున్నారు. అయితే లాక్ డౌన్ ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/