పదేళ్ల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ హీరోయిన్
పదేళ్ల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది పవన్ హీరోయిన్. గుడుంబా శంకర్ , భద్ర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన మీరా జాస్మిన్..తాజాగా తెలుగు లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఒకప్పుడు హోమ్లీ లుక్స్తో ప్రేక్షకుల చేత ఈలలు వేయించి గోల పెట్టించిన ఈ భామ.. సడెన్గా ఈ మధ్య గేరు మార్చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మీరా జాస్మిన్ పోస్ట్ చేస్తున్న ఫొటోస్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. ఈ సారి హోమ్లీ అనే పదానికి దూరం గా ఉంటూ హాట్ డోస్ పెంచి కెమెరా ముందుకు రావడానికి రెడీ అన్నట్లుగా ఆమె హింట్స్ ఇస్తూ వస్తుంది. ఆ హాట్ నెస్ ఇప్పుడు అమ్మడికి ఛాన్సులు వచ్చేలా చేసిందంటున్నారు అభిమానులు.
‘విమానం’ అనే తెలుగు-తమిళ బైలింగ్యువల్ సినిమాతో మీరా టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. జీ స్టూడీయోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటీవ్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. చివరగా తెలుగులో మీరా జాస్మిన్ ‘మోక్ష’ అనే సినిమాలో నటించింది. హర్రర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా 2013లో రిలీజైంది. శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పాండే, నాజర్, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటించారు. మరి మీరాకు రీ ఎంట్రీ ఎంతమేర కలిసొస్తుందో చూడాలి.