వృద్ధులకైనా వైద్య సేవలు అందించాల్సిందే

కరోనా సోకిన వృద్ధులంటే అంత చులకనా… ఐరాస ప్రధాన కార్యదర్శి ఆగ్రహం

antonio guterres
antonio guterres

జెనీవా: పలు దేశాల్లో కరోనా మహమ్మారి కేసులు సంఖ్య పెరుగుతుండడంతో ఆసుప్రతులల్లో కూడా కరోనా రోగుల సంఖ్య పెరుగుతుంది. దీంతో కొన్ని ఆసుపత్రి వర్గాలు కరోనా సోకిన వృద్ధులకు వైద్యం అందించించేందు నిరాకారిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈక్రమంలోనే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్రంగా స్పందించారు. కరోనా వైరస్ కు గురైన వృద్ధులను ఎంతో చులకనగా చూస్తున్నట్టు తెలుస్తోందని, ఇది ఎంతమాత్రం సహించరానిదని స్పష్టం చేశారు. వృద్ధులకైనా, మరెవరికైనా వైద్య సేవలు అందించాల్సిందేనని అన్నారు. అంతేకాకుండా, కొన్నిదేశాల నుంచి వలస వచ్చిన విదేశీయుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని, నిరాశ్రయులకు వైద్య సేవలు అందించడం పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారని గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలోనూ విధులు నిర్వర్తిస్తున్న పాత్రికేయులు, వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి ద్వేషపూరిత వాతావరణానికి ముగింపు పలకాలని ఆయన పిలుపునిచ్చారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/