భారత మార్కెట్లోకి విటారా బ్రెజా
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ విటారా బ్రెజా పెట్రోల్ వేరియంట్ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్-6 ప్రమాణాలతో వచ్చిన ఈ కారు వినియోగదారులను ఆకట్టుకోనుందని సంస్థ తెలిపింది. పాత వెర్షన్తో పోలిస్తే లుక్స్లో కొన్ని మార్పులు చేశారు. ఇక వేరియంట్ని బట్టి ధరను రూ. 7.34 లక్షల నుంచి రూ.11.40 లక్షలుగా (ఎక్స్షోరూం) నిర్ణయించారు. దీన్ని 2020 ఆటో ఎక్స్పోలోనే ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో వస్తున్న ఈ కారు 102 బీహెచ్పీ శక్తిని 134 ఎన్ఎం టార్క్ని ఉత్పత్తి చేస్తుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/