మారుతి సుజుకి.. ‘జీరో సేల్స్’

మార్చిలో 47 శాతం తగ్గిన కార్ల అమ్మకాలు..ప్రకటన విడుదల చేసిన మారుతి సుజుకి

MARUTHI
MARUTHI

ముంబై : కరోనా లాక్ డౌన్ తో దేశంలో పలు సంస్థల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కాగా ..మారుతి సుజుకి ప్రతి నెలా వేల సంఖ్యలో కార్లను విక్రయించే ఈ సంస్థ చరిత్రలో తొలిసారిగా గడచిన ఏప్రిల్ లో ‘జీరో సేల్స్’ నమోదయ్యాయి. తాము ఏప్రిల్ లో ఒక్క వాహనాన్ని కూడా విక్రయించలేదని, ఇదే సమయంలో ముంద్రా పోర్టు నుంచి 632 వాహనాలను మాత్రం ఎగుమతి చేశామని సంస్థ అధికారికంగా వెల్లడించింది. అది కూడా పాక్షికంగా ప్రొడక్షన్ ను ప్రారంభించేందుకు కేంద్రం అనుమతించిన తరువాత జరిగిందేనని తెలిపింది. మార్చి 22 నుంచి ఉత్పత్తి నిలిచిపోయిందని, మార్చిలోనే 47 శాతం మేరకు అమ్మకాల కోత నమోదైందని పేర్కొంది. 2019 మార్చిలో 1,58,076 వాహనాలను విక్రయించిన సంస్థ ఈ సంవత్సరం మార్చిలో 83,792 యూనిట్లను విక్రయించినట్టు ప్రకటించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:
https://www.vaartha.com/news/national/