నేడు జేపీ నడ్డా సమక్షంలో బిజెపిలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి
హైదరాబాద్ః మాజీ మంత్రి, సనత్నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఈరోజు (నవంబర్ 25) కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బిజెపి లో చేరనున్నారు. దీంతో గురువారమే మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, సీనియర్ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇతర రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
కాగా, ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్ర నేతలు బిజెపి పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఫాం హౌస్ వ్యవహారం, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు సిట్ నోటీసుల అంశంతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను వారు హైకమాండ్ కు వివరించే అవకాశముంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర అంశం కూడా ప్రస్తావనకు వచ్చే ఛాన్సుంది. ఇటీవల జరిగిన శిక్షణా తరగతులు, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర నేతలు అధిష్టానానికి తెలపనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/