బిజెపిలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి

marri-shashidhar-reddy-joined-bjp-in-delhi

న్యూఢిల్లీః మర్రి శశిధర్ ఈరోజు బిజెపిలో చేరారు.కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ ఆయనకు బిజెపి కండువా కప్పి పార్టీలోకి అహ్వనించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండిస సంజయ్, లక్ష్మణ్, డీకే ఆరుణ, వివేక్ వెంకటస్వామి ఇతర నేతలు హాజరయ్యారు. ఇటీవల కాంగ్రెస్ కు శశిధర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ ప్రజలు మంచి సర్కారును కోరుకున్నరు.. కానీ అది రాలేదని శశిధర్ రెడ్డి అన్నారు. మొత్తం ప్రపంచంలో ఇంత అవినీతి ప్రభుత్వం ఎక్కడా లేదని ఆరోపించారు. గత ఎనిమిదిన్నర ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్​ ఫెయిల్​ అయిందన్నారు. మోడీ నాయకత్వంలో దేశం ముందుకు వెళుతోందని … తాను ఎంతో ఆలోచించాకే బిజెపిలో చేరానన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్​కు బుద్ధి చెప్పడం బిజెపితోనే సాధ్యమవుతుందని, ఇలాంటి ఘట్టంలో భాగస్వామ్యం అవుతున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. బిజెపి బలోపేతానికి కృషి చేస్తానన్న శశిధర్ .. రాష్ట్రంలో బిజెపి సర్కారు ఏర్పాటుకు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమేనన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/