స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని స్వల్ప నష్టాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 11 పాయింట్ల నష్టంతో 38,128 వద్ద ముగిసింది. నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 11,194 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.83గా ఉంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/