లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

BSE
BSE

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 355 పాయింట్లు లాభపడి 57,990కి పెరిగింది. నిఫ్టీ 114 పాయింట్లు పుంజుకుని 17,100 వద్ద స్థిరపడింది. మార్కెట్లు మగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.56 వద్ద కొనసాగుతుంది.