భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

BSE
BSE

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకోవడమే కాకుండా… ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 890 పాయింట్లు పెరిగి 59,809కి చేరుకుంది. నిఫ్టీ 272 పాయింట్లు లాభపడి 17,594 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.95 వద్ద కొనసాగుతుంది.