మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్లు కోల్పోయి 52,482కి పడిపోయింది. నిఫ్టీ 26 పాయింట్లు పతనమై 15,721 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.32 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/