నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 289 పాయింట్లు నష్టపోయి 57,925కి పడిపోయింది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 17,076 వద్ద స్థిరపడింది. మార్కెట్ల ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.27 వద్ద కొనసాగుతుంది.