వారాంతాన్ని భారీ లాభాలతో ముగించిన దేశీయ మార్కెట్లు

సెన్సెక్స్ 50,540- నిఫ్టీ 15,175

BSE

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని భారీ లాభాలతో ముగించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు తమ హవా కొనసాగించాయి. కీలక రంగాల షేర్లు లాభాల దిశగా పయనించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా లాభపడింది. 49,833 వద్ద ప్రారంభించిన సెన్సెక్స్ చివరకు 972 పాయింట్లు లాభపడి 50,540 వద్ద ముగిసింది. నిఫ్టీ 14,987 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టి 269 పాయింట్లు పెరిగి 15,175 వద్ద స్థిరపడింది.  

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/