రాజు మృతి ఫై మంచు మనోజ్ రియాక్షన్..దేవుడున్నాడు

అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని అతి దారుణంగా రేప్ చేసి , హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మ హత్య చేసుకోవడం తో తెలుగు రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి త‌గిన శాస్తి జ‌రిగింద‌నీ, సరిగ్గా వారం రోజులకే ప్రాణాలు విడిచాడనీ .. ఇప్పుడూ ఆ చిన్నారి చైత్ర ఆత్మ శాంతి చేకూరింద‌ని అభిప్రాయ ప‌డ్డారు.

ఈ క్రమంలో హీరో మంచు మనోజ్ త‌న‌దైన శైలిలో సోష‌ల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ వార్త విన్నందుకు చాలా సంతోషంగా ఉంది.. దేవుడు ఉన్నాడు అంటూ ట్వీట్ చేశారు. ఇక మొన్న చిన్నారి కుటుంబాన్ని మనోజ్ పరామర్శించిన సంగతి తెలిసిందే. మొత్తానికి రాజు మరణ వార్త అందరిలో సంతోషం నింపుతుంది.

సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారి ఫై అత్యాచారం చేసి , చంపేసి పారిపోయిన రోజు..8 వ రోజు ఉదయం స్టేషన్ ఘనపూర్ రైల్వే ట్రాక్ ఫై ఆత్మ హత్య చేసుకున్నాడు. రాజు ఆత్మ హత్య చేసుకున్నాడనే వార్త బయటకు రాగానే అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.