మరోసారి మనీష్‌ సిసోడియా కస్టడీ పొడగింపు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా కస్టడీని మరోసారి పొడగించింది ఈడీ. మరో 14 రోజుల పాటు సిసోడియా కస్టడీ పొడిగించారు. ఏప్రిల్‌ 3 వరకు సిసోడియా కస్టడీని పొడిగించింది. మార్చి 20వ తేదీతో సిసోడియా కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో కస్టడీని పొడిగించి సిసోడియాను కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరు పరుచనున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కాంలో మరో నిందితుడు, కవిత బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ కూడా మార్చి 20వ తేదీతో ముగిసింది. దాంతో ఈడీ అధికారులు కాసేపట్లో పిళ్లైని కూడా రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం ముందు హాజరు పరుచనున్నారు.

ఇదిలా ఉంటె ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఎమ్మెల్సీ కవిత..రెండోసారి ఈరోజు ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు 5 గంటలుగా ఈడీ విచారణ జరుగుతూనే ఉంది. ఈ విచారణలో పిళ్లైతో కలిసి ఈడీ కవితను విచారిస్తుంది. ఈ విచారణలో సౌత్ గ్రూప్ వ్యక్తులతో సంబంధాలపై ఈడీ ఆరా అధికారులు తీస్తున్నారని తెలుస్తోంది.