ఈ విధంగా వ్యవహరించడం దిగ్ర్భాంతికరం
రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటా: సుమలత: సుమలత
అమరావతి: లోక్సభ సిటింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కస్టడీలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర దిగ్ర్భాంతికరమని, నమ్మలేకపోతున్నానని కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలత పేర్కొన్నారు. ఈ విషయంపై ఆమె తాజాగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఎంపీపై కస్టడీలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం దిగ్ర్భాంతికరమని ఆమె పేర్కొన్నారు.
ఈ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని, దీని గురించి తెలుసుకుని విస్మయానికి గురయ్యానని చెప్పారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ తీరు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై చెడు ప్రభావం చూపిస్తుందని అన్నారు. తన సహచర ఎంపీ రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటానని ఆమె చెప్పారు. ఆయనపై జరిగిన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుపుతూ ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/