మనోజ్ తో గొడవ ఫై మంచు విష్ణు స్పందన

మంచు అన్నదమ్ముల మధ్య వివాదం ఇప్పుడు చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు కలిసి ఉండే అన్నదమ్ముల మధ్య గొడవ రావడం ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య గొడవ అనేది ఈరోజు కాదని, గత కొద్దీ రోజులుగా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని, కాకపోతే ఇది బయటకు రాలేదని అంటున్నారు. మంచు మనోజ్ సన్నిహితుడు సారథి ఫై విష్ణు చేయి చేసుకోవడం తో మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసాడు. విష్ణు ఇలా ఇళ్ల మీదకు వచ్చి గొడవ చేయడం, నా తరుపు వారిపై చేయి చేసుకోవడం కొత్తమీ కాదని చెప్పడం తో వీరిద్దరి గొడవ బయటకు వచ్చింది. వీరిద్దరి గొడవ ఫై ఇప్పటికే మోహన్ బాబు , మంచు లక్ష్మి లు స్పందించారు. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్ అని , కొన్ని గంటల్లో అవి చల్లారి పోతాయని మోహన్ బాబు తెలుపగా..మంచు లక్ష్మి ఈ గొడవ గురించి కానీ మనోజ్ పోస్ట్ చేసిన పోస్ట్ గురించి కానీ తెలియదని తెలిపింది. తాజాగా మంచు విష్ణు ఈ గొడవ ఫై స్పందించారు.

మా మధ్య సాధారణంగా జరిగేదేనంటూ మంచు విష్ణు పేర్కొన్నారు. మా మధ్య గొడవలు సాధారణ మే..భూతద్దంలో చూడవద్దని కోరారు. ఇది చాలా చిన్న విషయం..అని దీన్ని భూతద్దంలో చూడవద్దని కోరారు. ఇక సారథి విషయానికి వస్తే..మోహన్ బాబు సమీప బంధువే సారథి.. విష్ణు ఫిల్మ్ కెరీర్ ప్రారంభం నుంచి.. అతని వెన్నంటే ఉంటున్నారు. ఇటీవల కాలంలో విష్ణుకు దూరంగా జరిగి.. మనోజ్‌కు సారథి దగ్గరయ్యారు. తమ మధ్య విబేధాలు సృష్టిస్తున్నాడని, తన గురించి అనుచితంగా మాట్లాడుతున్నాడని.. గత రాత్రి సారథి ఇంటికి వెళ్లాడు విష్ణు. ఆగ్రహంతో రగిలిపోతూ సారథిపై విష్ణు దాడి చేశాడు. దీంతో సారథి ముఖానికి గాయాలయ్యాయి.