కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో మంచి విష్ణు భేటీ
మంత్రి కార్యాలయం ట్విట్టర్ లో వెల్లడి
Hyderabad: కేంద్ర సాంస్కృతిక..పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డితో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్లో మంత్రి కార్యాలయంలో జరిగిన భేటీలో విష్ణు ఏం మాట్లాడారన్న వివరాలు బయటకు రాలేదు.. మంచు విష్ణు తనను కలిసిన విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం తన ట్విట్టర్ వేదికగా పేర్కొంది.. విష్ణు కేంద్ర మంత్రిని ఎందుకు కలిశారన్న దానిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతుంది. వీరి భేటీపై మరో వాదన కూడా తెరపైకి వచ్చింది.. మంచు విష్ణు బిజేపిలో చేరబోతున్నారని. దానికోసమే ఆయన కిషన్ రెడ్డితో భేటీ అయ్యారని మరో రాజకీయ గాసిప్ విన్పిస్తోంది..
అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/