తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోలు మంచు విష్ణు, విశ్వక్ సేన్

సోమవారం తిరుమల శ్రీవారిని హీరోలు విశ్వక్ సేన్ , మంచు విష్ణు లు దర్శించుకున్నారు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా నటిస్తూ తెరకెక్కించిన మూవీ ‘దాస్ కా ధమ్కీ’. మార్చి 22న థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విశ్వక్ సేన్. నిన్న తిరుమలకు చేరుకున్న విశ్వక్..మెట్ల మార్గాన కొండపైకి చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు.

మరో హీరో, ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.