అలీ సరదా షో విష్ణు సీరియస్ చేసారు..ఆ ఒక్క ప్రశ్న తో షో సీరియస్ గా సాగింది

ఈటీవీ లో అలీతో సరదాగా షో ప్రతి వారం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రతి వారం ఓ గెస్ట్ ను పిలిచి వారి సినిమాలకు సంబదించిన విశేషాలే కాక పర్సనల్ విషయాలను సైతం వారి దగ్గరి నుండి రాబట్టి అలీ షో ఫై ఇంట్రస్ట్ పెంచుతుంటారు. తాజాగా మంచు విష్ణు హాజరయ్యారు. మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న తరుణంలో విష్ణు ను గెస్ట్ గా పిలిచే సరికి అందరిలో ఆసక్తి పెరిగింది.

ప్రతి వారంలో అడిగే మాదిరిగానే ఈ వారం కూడా విష్ణు సినిమాల గురించి , మా ఎన్నికల గురించి ప్రశ్నలు అడిగిన అలీ..చివర్లో నీకు, నీ తమ్ముడు మనోజ్‌కి పడడం లేదని.. మీ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని విన్నాను ఇది నిజమేనా అని అడిగాడు. అంతే ఆ ప్రశ్న కు విష్ణు కు ఎక్కడో కాలింది. దీంతో వేసుకున్న కోటు విప్పేస్తూ సీరియస్ అయ్యారు. పర్సనల్ విషయాలు ఎందుకు చెప్పాలి..అంటూ కోపంగా సీటులోంచి లేచి నిలబడ్డారు. ఆ తర్వాత కాస్త కూల్ అయ్యి ..తాము చాలా సంప్రదాయ పద్ధతిలో పెరిగామని, అయితే ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లకు ఉంటుందని అన్నారు. తనకైతే ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం కాబట్టి నాన్నగారితో కలిసి ఉంటున్నానని, అక్క సపరేట్ ఇంట్లో, తమ్ముడు కూడా సపరేట్ ఇంట్లో ఉంటున్నాడని చెప్పారు. వాళ్ళు ప్రైవసీగా ఉండడం వాళ్ల వ్యక్తిగత ఇష్టం.. అంతమాత్రాన మాట్లాడటం లేదు, విభేదాలు ఉన్నాయని అందరు అనుకోవడం తప్పని విష్ణు అన్నారు.