ఢిల్లీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు

జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్!
దేశంలో 33కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ వారం జింబాబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికుడి నుంచి తీసుకున్న నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించగా ఒమిక్రాన్ వేరియంట్‌ వెలుగుచూసింది. అతను ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. దేశ రాజధానిలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌లో చేర్చారు. ఢిల్లీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.

ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చేరిన 27 మంది విదేశీ ప్రయాణికుల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఇప్పటివరకు నిర్వహించామని, అందులో 25 నమూనాలు నెగెటివ్‌గా ఉన్నాయని, ఇద్దరు వ్యక్తుల నమూనాల్లో ఒమిక్రాన్ వేరియెంట్ ను కనుగొన్నామని వైద్యాధికారులు చెప్పారు.దీంతో దేశంలో మొత్తం ఒమైక్రాన్ కేసుల సంఖ్య 33కి పెరిగింది. శుక్రవారం నాటికి దేశంలో 32 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి, మహారాష్ట్రలో శుక్రవారం 7 ఒమైక్రాన్ కేసులు బయటపడ్డాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/