దసరా పండగ వేళ..విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అపశ్రుతి

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని పూలతో అలకరించే క్రమంలో అపశృతి చోటుచేసుకుంది. అంతరాలయం మండపాన్ని పూలతో అలకరిస్తుండగా..ఓ యువకుడు ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడి మరణించాడు.

షామియానా సిబ్బందిలోని ఓ వ్యక్తి పూలు కట్టేందుకే పైకెక్కాడు. అతడు నిల్చున్న సిపాయి బల్ల కదలడంతో పట్టుతప్పి అమ్మవారి ధ్వజస్తంభం దగ్గరి నుంచి కిందపడ్డాడు. దీంతో, భక్తులు నిల్చునేందుకు ఏర్పాటు చేసిన క్యూలోని ఇనుపరాడ్లు అతడి తలకు బలంగా తాకడంతో తీవ్ర గాయమైంది. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ప్రస్తుతం దీనికి సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.