ప్రగతి భవన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు


హైదరాబాద్: సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు సకాలంలో అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆ వ్యక్తి సోదరుడు మంత్రుల కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లేందుకు యత్నించాడు. ఈ సోదరులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిది కొంపల్లి అని గుర్తించారు.

కాగా, ఓ సివిల్ వివాదంలో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, అందుకే ప్రగతి భవన్ ఎదుట ఆందోళనకు యత్నించామని ఆ అన్నదమ్ములు వెల్లడించారు. ఫిర్యాదు చేసిన తమనే పోలీసులు వేధిస్తున్నారని వారు ఆరోపించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/