ప్రధాని మోడికి మమతా బెనర్జీ లేఖ

మా రాష్ట్రానికి అన్ని విమాన సర్వీసులను తక్షణమే
ఆపేయాలని కోరుతూ.. లేఖ

mamata benergee
mamata benergee

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ తమ రాష్ట్రానికి వచ్చే అన్ని విమాన సర్వీసులను ఆపేయాలని కోరుతూ ప్రధాని మోడికి లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా దాదాపు 80 జిల్లాల్లో లాక్ డౌన్ అయిన తరుణంలో ఆమె తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో కరోనా విస్తరిస్తోందని… ఈ పరిస్థితుల్లో కూడా దేశంలో విమాన రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు. విమానాలు తిరిగితే షడ్ డౌన్ కు అర్థం లేదని… క్వారంటైన్ విధానాలకు కూడా ఇది తూట్లు పొడుస్తుందని అన్నారు. విమానాల్లో ప్రయాణికుల మధ్య సామాజిక దూరం ఉండదని… పక్కపక్కనే కూర్చుని ప్రజలు ప్రయాణిస్తారని… దీని వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/