రాజ్యసభలో ప్రతిపక్ష నేత పోస్టుకు ఖర్గే రాజీనామా
న్యూఢిల్లీః కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గేపోటీపడనున్న విషయం తెలిసిందే. శుక్రవారమే ఆయన పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక్కరికి ఒకటే పదవి అన్న నియమం ప్రకారం ఆయన ఈరోజు రాజ్యసభలో ప్రతిపక్ష నేత పోస్టుకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. ఇక రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా రేసులో చిదంబరం, దిగ్విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/