ఏఐసీసీ అధ్యక్ష పదవికి మల్లిఖార్జున ఖర్గే నామినేషన్ దాఖలు

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక సర్వత్రా ఆసక్తిగా మారుతోంది. ఇప్ప‌టికే అధ్యక్ష బరిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పోటీలో మల్లికార్జున ఖర్గే చేరారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నామినేషన్ దాఖలు చేశారు. అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ఆఫీసులో అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు పార్టీ సీనియర్లు పాల్గొన్నారు. ఏకే ఆంటోనీ, అశోక్ గెహ్లాట్, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అభిషేక్ సింఘ్వీ, అజయ్ మాకెన్, భూపీందర్ సింగ్ హూడా, దిగ్విజయ్ సింగ్, తారీఖ్ అన్వర్ సహా 30 మంది నేతలు ఖర్గే అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు.