మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్రెడ్డికి అస్వస్థత
మంత్రి మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్రెడ్డి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురై..సూరారం లోని హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మల్లారెడ్డి మరదలి కుమారుడు ప్రవీణ్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఐటి అధికారులు సురారంలోని ఆసుపత్రికి తీసుకొచ్చారు. నిన్న జరిగిన సోదాల్లో ఐటి అధికారులకు ప్రవీణ్ రెడ్డి సహకరించలేదని సమాచారం. మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీ బాధ్యతలను ప్రవీణ్ రెడ్డినే చూస్తుంటారు. సోదాలు జరుగుతోన్న క్రమంలోనే ప్రవీణ్ రెడ్డి అస్వస్థతకు గురవ్వడంతో ఐటి అధికారులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం మహేందర్ రెడ్డికి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే హాస్పటల్ కు తరలించారు. మల్లారెడ్డి పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించి నిన్నటి నుండి సోదాలు చేపట్టారు. మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి మల్లారెడ్డి కాలేజీలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా డైరెక్టర్గా మహేందర్ రెడ్డి ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు గర్తించారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫాం మెడోస్లో ఉంటున్న మహేందర్ రెడ్డి హౌస్లో అధికారులు దాడులు చేపట్టారు. అక్కడే పక్కనే నివాసం ఉంటున్న మల్లారెడ్డి మరో కుమారుడు భద్రారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.