రేవంత్ రెడ్డి ఫై మంత్రి మల్లారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి పలు వ్యాఖ్యలు చేసారు. దుండిగ‌ల్ ప‌రిధిలోని బ‌హ‌దూర్‌ప‌ల్లిలో ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీని ప్రారంభోత్సంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి రేవంత్ ఫై నిప్పులు చెరిగారు. పైసలు ఇచ్చి పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి కొనుక్కన్నాడని , ప్రెసిడెంట్ అయ్యాక పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని మల్లారెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ అవ్వగానే సీఎం అయ్యినట్లు కలలుగంటున్నాడని, తాను ఎంపీగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభిృద్ధిని చూసి ఓర్వలేక అనవసర ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ది స్కీంల ప్రభుత్వమైతే..కాంగ్రెస్, బీజేపీలవి స్కాంల ప్రభుత్వాలని అన్నారు.

రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మీ వంటి ఎన్నో పథకాలు టీఆరఎస్ పార్టీ ప్రవేశపెట్టిందని , టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ ను మాత్రమే నమ్ముతున్నారని..రానున్న ఎన్నికల్లో కూడా తమ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.