సైనా, సింధు శుభారంభం
మలేషియా మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్కు అర్హత
కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ కొత్త ఏడాదిలో శుభారంభం చేశారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్లో విజయాలు సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్, ఆరోసీడ్ సింధు 21-15, 21-13తో రష్యాకు చెందిన ఎవ్గెని కొసెత్సకయాను 35 నిమిషాల్లోనే మట్టికరిపించింది. మరో మ్యాచ్లో అన్సీడెడ్ సైనా 21-15, 21-17తో లియానె టాన్ (బెల్జియం)పై విజయం సాధించింది. రెండో రౌండ్లో అయా ఒహొరితో సింధు.. ఎనిమిదో సీడ్ అన్సే యంగ్ (కొరియా)తో సైనా తలపడనున్నారు. అయితే పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సాయి ప్రణీత్ నిరాశ పరిచారు. హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ మాత్రం తొలిరౌండ్ను అధిగమించారు. ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ రెండో సీడ్ చౌ టెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో కనీస పోరాటం కనబరచకుండా వెనుదిరిగాడు. మరో సింగిల్స్లో సాయి ప్రణీత్, రాస్మస్ గెమ్కె (డెన్మార్క్) చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగాడు. కశ్యప్, మొమోటా చేతిలో ఓటమిపాలయ్యాడు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/