చిత్రసీమలో మరో విషాదం..ప్రముఖ మలయాళ నటుడు మృతి

కరోనా మహమ్మారి కారణంగా చిత్ర సీమా ఎంతోమంది ప్రముఖులను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ మళ్లీ షూటింగ్ లతో , థియేటర్స్ ఓపెన్ తో కళకలాడుతుంది అనుకునేలోపే వరుస మరణాలు చిత్రసీమ ను శోకసంద్రంలో పడేస్తుంది. సోమవారం ఉదయం ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి క్యాన్సర్ కారణంగా తుదిశ్యాస విడువడం తెలుగు చిత్రసీమ ను షాక్ కు గురి చేయగా..ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ లోను విషాదం చోటుచేసుకుంది.

మలయాళ నటుడు రిజబావా(55) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘డాక్టర్ పశుపతి’ అనే సినిమాతో 1990లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. అదే ఏడాది వచ్చిన ‘ఇన్ హరిహర్ నగర్’ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన కెరీర్‌లో 150కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. సినిమాలతోనే కాక.. ఆయన పలు సీరియల్స్‌లో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు. చివరిగా మమ్ముట్టి నటించి ‘వన్’ అనే సినిమాలో ఆయన కనిపించారు. ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియపరుస్తున్నారు.