కియారా అద్వానీ పెళ్లిలో సందడి చేయబోతున్న చరణ్ , మహేష్..?

కియారా అద్వానీ మరికొన్ని గంటల్లో ఓ ఇంటిది కాబోతుంది. సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి ఏడు అడుగులువేయబోతుంది. రాజస్థాన్ జైసల్మేర్ లోని సూరజ్ గడ్ ప్యాలెస్ లో వీరి వివాహం అట్టహాసంగా మంగళవారం రాత్రి జరగబోతుంది. గత రెండు రోజులుగా అక్కడ హడావిడి వాతావరణం నెలకొనింది. ఇప్పటికే పలు ఇండస్ట్రీల ప్రముఖులు అక్కడికి చేరుకొని సందడి చేస్తున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీ నుండి మెగా పవర్ స్టార్ , సూపర్ స్టార్ మహేష్ బాబు లు హాజరుకాబోతున్నట్లు సమాచారం అందుతుంది.

బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కియారా .. తెలుగులోనూ ‘భరత్ అను నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇక హిందీలో కబీర్ సింగ్, షేర్షా లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్- శంకర్ కాంబోలో తీస్తున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. తెలుగులో కొన్నే సినిమాలు చేసినప్పటికీ..యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోలతో చాల సన్నిహితంగా ఉండడం తో ఈమె పెళ్లికి అగ్ర హీరోలు వెళ్తున్నట్లు తెలుస్తుంది.

ఇక కియారాతో సిద్దార్థ్ ప్రేమ కథ ఎలా మొదలైందో చూస్తే..కియారా ఫస్ట్ టైం ఒక పార్టీలో కలిశారు. ఆంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ షూటింగ్ వ్రాప్ అప్ పార్టీకి సిద్ధార్థ్ మల్హోత్రా హాజరయ్యారు. ఆ సందర్భంగా మొదటిసారి కియారాను సిద్దార్థ్ కలిశారు. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. పోనే నంబర్స్ ఎక్స్ఛేంజ్ అయ్యాయి. ఫోన్ లో మాటలు కాస్త ప్రేమ పాఠాలుగా మారాయి. ఇప్పుడు పెళ్లికి దారితీసాయి.