మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూత

మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకాని (89) కన్నుమూశారు. గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె..ముంబైలో నిన్న తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని వార్దాలో గాంధీ స్థాపించిన సేవాగ్రామ్ ఆశ్రమంలోనే ఉష బాల్యం గడిచింది. ముంబై మణి భవన్‌లోని గాంధీ స్మారక్ నిధికి ఉష చైర్ పర్సన్‌గానూ పనిచేశారు.

భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మణి భవన్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉండేది. మహాత్మాగాంధీ 1917-1934 మధ్య తరచూ మణి భవన్‌లోనే బస చేసేవారు. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు అక్కడే నాంది పడింది. ఇందులో రెండు సంస్థలు ఉన్నాయి. ఒకటి గాంధీ స్మారక్ నిధి కాగా, మరోటి మణి భవన్ గాంధీ సంగ్రహాలయ. మణిభవన్‌తో గాంధీకి జీవితకాలంపాటు అనుబంధం ఉంది. 2 అక్టోబరు 1955లో మణి భవన్‌ను గాంధీ మెమోరియల్ సొసైటీకి అప్పగించారు.

మహాత్మా గాంధీ 1917 నుంచి 1934 మధ్యకాలంలో అనేక సార్లు మణి భవన్‌లోనే ఉన్నారు. ఇది దేశ స్వాతంత్ర్య పోరాటంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, శక్తివంతమైన ఉద్యమాలకు సాక్ష్యంగా ఉంది. ఇక, మణి భవన్‌లో.. గాంధీ స్మారక్ నిధి ముంబై, మణి భవన్ గాంధీ సంగ్రహాలయ అనే రెండు సంస్థలు ఉన్నాయి.