మహారాష్ట్రలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఒక్కరోజులోనే 2,500 వేల దాకా పెరుగుదల

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆ రాష్ట్ర సర్కారు ఇప్పటికే చాలా చోట్ల లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. దీంతో జనం గుంపులు కడుతున్నారు. కరోనా ముప్పుందని తెలిసినా.. నిబంధనలను పట్టించుకోవడం లేదు. దీంతో రెండ్రోజులుగా తగ్గిన కరోనా కేసులు తాజాగా మళ్లీ ఎక్కువయ్యాయి. పది వేల మార్కును దాటాయి.

బుధవారం కొత్తగా 10,107 మంది మహమ్మారి బారిన పడ్డారు. అంతకుముందు రోజు 7,652 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంటే ఒక్కరోజులోనే 2,500 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ముంబయి మహా నగరంలో 821 కేసులు నమోదవగా.. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు 50 శాతం వరకు పెరిగాయి. గత 11 రోజుల్లో నగరంలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/