టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ.. 17మందిపై కేసు

రేపటి వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఆదివారం టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య జరిగిన గొడవకు సంబంధించి పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తోపాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు 17 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితోపాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు 12 మందిపై కేసులు నమోదయ్యాయి. అలాగే, రేపటి వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండడంతో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి లేదని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/