నటి మాధురి దీక్షిత్ ఇంట విషాదం

బాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ తల్లి స్నేహలతా దీక్షిత్ (91) 2023, మార్చి 12న కన్నుమూశారు. ఇటీవల ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మృతిచెందిన వార్తను మరువకముందే మరో మరణ వార్త అందర్నీ శోకసంద్రంలో పడేసింది. తల్లి మరణంతో మాధురి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మాధురి, ఆమె భర్త శ్రీరామ్ నేనే ఈ విషయాన్ని ప్రకటించారు. “మేము ఎంతగానో ప్రేమించే ఆయి(అమ్మ) ఈ రోజు ఉదయం తనకు ఇష్టమైన వారి మధ్య ఉన్నప్పుడు స్వర్గస్తులయ్యారు” అని రాసుకొచ్చారు. అయితే స్నేహలత మృతికి కారణాలేంటో ఇంకా తెలియరాలేదు.

వర్లీలోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3.00 గంటలకు స్నేహలత అంత్యక్రియలు నిర్వ్హయించారు. ఎల్లప్పుడూ ఎంతో, ప్రేమగా సన్నిహితంగా ఉండే తల్లి దూరమయ్యేసరికి మాధురి.. తల్లి ఇక తిరిగిరాదనే విషయాన్నీ జీర్ణించుకోలేకపోతోంది. గతేడాది జూన్ లో మాధురి తన తల్లి బర్త్ డేని సెలబ్రేట్ చేసింది. ఇంతలోనే ఇలా జరిగేసరికి.. స్నేహలత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. సినీ ప్రముఖులు, నెటిజన్స్, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.