వాటిని పరిపాలన రాజధానులుగా చేశారు
మహానగరాలుగా ప్రయత్నం జరిగిన పై రెండు సార్లు విఫలంగా మిగిలాయి
అమరావతి: ప్రపంచంలోని పలు దేశాల్లో కొత్త రాజధానులు నిర్మాణం ముందు పరిశీలించిన అంశాల గురించి ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని పోస్టు చేస్తూ ఏపీ మాజీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తన అభిప్రాయన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ అంతర్జాతీయ అనుభవాలలో కొన్ని ముఖ్య విషయాలు. నేపిడా, బ్రెసిలియా తప్ప మిగిలనవన్నీ పరిపాలన రాజధానులుగా రూపొందించారు కానీ మహానగరాలుగా కాదని ఐవైఆర్ అన్నారు. మహానగరాలుగా ప్రయత్నం జరిగిన పై రెండు నగరాలు విఫలంగా మిగిలాయి. కాన్బెర్రా, అబూజ లాంటి రాజధానులు చాలా చర్చల తర్వాత అవగాహనకు అణుగుణంగా ఏర్పాడ్డాయని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/