పోలీసులను ఆశ్రయించిన మాచర్ల డైరెక్టర్
“మాచర్ల నియోజకవర్గం” మూవీ డైరెక్టర్ ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో ఎవరో ఓ వ్యక్తి ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి కొన్ని వర్గాలను కించపరిచేలా కామెంట్లు చేసాడని , దీంతో సదరు వర్గాల వారు తాను డైరెక్ట్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారని పోలీసులకు పిర్యాదు చేసారు.
రాజశేఖర్ అనే పేరుతో ఉన్న ఓ అకౌంట్ నుంచి కొందరు మూడేళ్ల క్రితం కొన్ని కులాలను తిడుతూ ఓ ట్వీట్ చేశారని, దాన్ని తనకు అంటగడుతూ, మాచర్ల ముచ్చట్లు అంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించాడు. ఆ అకౌంట్ తనది కాదని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫేక్ ట్వీట్ల స్క్రీన్షాట్లను పోలీసులకు అందించాడు. దర్శకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇక “మాచర్ల నియోజకవర్గం” చిత్ర విషయానికి వస్తే..నితిన్ – కృతి శెట్టి జంటగా ఈ మూవీ లో నటించారు. ఈ మూవీ ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై నిర్మితమవుతుంది. ఈ క్రమంలో సినిమా తాలూకా ప్రమోషన్ కార్యక్రమాలు సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి.