సిద్దిపేటకు నూతన కలెక్టర్‌గా ఎం హనుమంతరావు బాధ్యతలు

అమరావతి: నేడు సిద్దిపేట జిల్లా నూత‌న క‌లెక్ట‌ర్‌గా ఎం హ‌నుమంత‌రావు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ ముజ‌మిల్ ఖాన్‌, జిల్లా రెవెన్యూ అధికారి బి చెన్న‌య్య‌, జిల్లా అధికారులు, క‌లెక్ట‌రేట్ అధికారులు, సిబ్బంది.. క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు శుభాకాంక్ష‌లు తెలిపారు.

కాగా, సంగా‌రెడ్డి కలె‌క్టర్‌ ఎం హను‌మం‌త‌రా‌వుకు సిద్ది‌పేట కలె‌క్ట‌ర్‌గా అద‌నపు బాధ్య‌తలు అప్ప‌గిం‌చిన విష‌యం తెలిసిందే. వెంక‌ట్రా‌మ్‌‌రెడ్డి రాజీ‌నా‌మాతో సిద్ది‌పేట కలె‌క్టర్‌ పోస్టు ఖాళీ అయ్యింది. ఆయన స్థానంలో హను‌మం‌త‌రా‌వుకు అద‌నపు బాధ్య‌తలు అప్ప‌గిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్య‌దర్శి సోమే‌శ్‌‌కు‌మార్‌ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ‌చే‌శారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/