కరోనా నివారణ చర్యలకు ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ వితరణ

రూ.3కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు అందజేత

L&T Metro Rail Donates PPE kits
L&T Metro Rail Donates PPE kits

Hyderabad: కరోనా మహమ్మారి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మద్దతు ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ చేయూత నిచ్చింది.

రూ.3కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లను ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ హైదరాబాద్‌ ఎండీ కేవీబీ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు.

ఇందుకు  సంబంధించిన లేఖను ఎన్వీఎస్‌ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌కు అందించారు. ఐటీసీ సీఎండీ సంజీవ్‌ పూరి ఇచ్చిన రూ.2కోట్ల చెక్కును తెలంగాణ ఐటీసీ సీఈవో సంజయ్ సింగ్‌.. కేటీఆర్‌కు అందించారు.

పోచంపాడ్‌ కన్‌స్టక్షన్‌ కంపెనీ రూ.కోటి విలువైన పీపీఈ కిట్లు అందించింది. మరికొంత మంది దాతలు విరాళానికి సంబంధించిన చెక్కులను కేటీఆర్‌ను కలిసి అందజేశారు.

సీఎం సహాయనిధికి విరాళాలు అందజేసిన వారికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/