కేంద్ర బడ్జెట్లో నిరుద్యోగానికి ప్రాధాన్యతే లేదు
దేశం ముందు అతిపెద్ద సవాల్ నిరుద్యోగం
న్యూఢిల్లీ: శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెదవి విరిచారు. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిరుద్యోగం అని, అయితే కేంద్ర బడ్జెట్లో నిరుద్యోగానికి ప్రాధాన్యతే లేదని రాహుల్ అన్నారు. నిర్మలా బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం ముందు అతిపెద్ద సవాల్ నిరుద్యోగం. అయితే దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఒక్క వ్యూహాత్మక ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వ ధోరణి ఇదే. ఈ బడ్జెట్ ప్రభుత్వ పని తీరుకు అద్దం పడుతోంది. ప్రభుత్వంలో ఉన్నవారంతా మాట్లాడే వారే. కానీ పని చేసే వారే లేదు అని రాహుల్ అన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చయండి: https://www.vaartha.com/andhra-pradesh/