ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
ఇసుక లారీ ఢీకొనడంతో ప్రమాదం
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పసరగొండ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న ఇసుక లారీ, ఓ కారు ఢీ కొన్నాయని పోలీసులు వెల్లడించారు. మరణించిన వారు జిల్లా పరిధిలోని పోచం మైదాన్ కు చెందిన వారని, వారిని మేకల రాకేశ్, చందు, రోహిత్, పవన్, సాబిర్ లుగా గుర్తించామన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి, ముందు వెళుతున్న ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కాగా, ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ శ్రీనివాస్, సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను వరంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసును నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతులు వరంగల్ జిల్లాలో పుట్టిన రోజు వేడుకలకు హాజరై పరకాల వైపు వెళ్తున్న క్రమంలో ఘటన చోటు చేసుకుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/