ఆయుష్మాన్ భారత్ అమలయ్యేలా చూడండి
కెసిఆర్ కు బండి సంజయ్ లేఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ను అమలు చేయాలని సిఎం కెసిఆర్కు లేఖ రాశారు. దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉందని, ఈ కరోనాను కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్లో చేర్చిందని .. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఆయుష్మాన్ భారత్ అమలు అయ్యేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలో కరోనా ను ఎదుర్కోవడానికి తమ సహకారం ప్రభుత్వానికి పూర్తిగా ఉంటుందని అన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/